SHARMILA: జగన్‌పై మరోసారి షర్మిల తీవ్ర విమర్శలు

SHARMILA: జగన్‌పై మరోసారి షర్మిల తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలు బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. విశాఖలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె మరోసారి జగన్ పై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేతగా హోదాపై పోరాటాలు చేసిన జగన్ ... అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రయోజనాలను బీజేపీ వద్ద తాకట్టపెట్టారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైసీపీ, టీడీపీ కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబువి కనిపించే పొత్తులు అని, వైసీపీ అధినేత సీఎం జగన్‌వి కనిపించని పొత్తులు అని విరుచుకుపడ్డారు. హోదాపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ గట్టిగా మాట్లాడారన్న షర్మిల... అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదాపై పోరాడలేదన్నారు. విశాఖకు ఏంచేశారు... రైల్వే జోన్ కూడా ఇవ్వలేదని షర్మిల మండిపడ్డారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు పోవాలి.. కాంగ్రెస్ రావాలని నినదించారు.

Next Story