AP: జగన్ ఎడ మొహం... షర్మిల పెడ మొహం

AP: జగన్ ఎడ మొహం... షర్మిల పెడ మొహం

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం కార్యక్రమం వేదికగా వైఎస్ఆర్ కుటుంబంలోని విభేదాలు బయటపడ్డాయి. కొడుకు ఎంగేజ్‌మెంట్‌కు ఆహ్వానించిన షర్మిల తన అన్న వైఎస్ జగన్, వదిన భారతీలను పట్టించుకోలేదు. కార్యక్రమానికి వచ్చినప్పటి నుంచి వెళ్లేంత వరకు జగన్, షర్మిల ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. కొడుకు ఎంగేజ్‌మెంట్‌కు ఆహ్వానించిన షర్మిల.. తన అన్న వైఎస్ జగన్, వదిన భారతిలను పట్టించుకోలేదు. కార్యక్రమానికి వచ్చినప్పటి నుంచి వెళ్లేంత వరకు జగన్, షర్మిల ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. షర్మిల ఆమె భర్త అనిల్ ఇద్దరూ జగన్‌ను పట్టించుకోలేదు. ఫోటో దిగేందుకు రావాలని జగన్ పిలిచినా షర్మిల, అనిల్ రాలేదుదాంతో బొకే ఇచ్చి నిమిషంలోనే ముఖ్యమంత్రి దంపతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.


ఏపీ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు సీఎం జగన్‌ హాజరయ్యారు. వరుడు వైఎస్‌ రాజారెడ్డి, వధువు అట్లూరి ప్రియలకు సీఎం జగన్‌ దంపతులు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు. హైదరాబాద్‌ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో ఈ నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. సీఎం జగన్‌ దంపతుల వెంట వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.

Next Story