By - Vijayanand |25 Aug 2023 12:36 PM GMT
అధికార పార్టీపై సర్పంచులు తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం సి.కొడిగేపల్లి సర్పంచ్ కవిత వైసీసీపికి గుడ్బై చెప్పారు. సర్పంచ్గా గెలిచి సంవత్సరాలు గడుస్తున్నా... గ్రామానికి, ప్రజలకు ఏం చేయలేకపోతున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తిప్పేస్వామి తమకు సముచిత స్థానం కల్పించడం లేదని ఆరోపించారు. ఆస్తులు అమ్ముకొని సర్పంచ్గా ఎన్నికైతే... కూలి పనికి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని రోదించారు. రాజీనామా పత్రాన్ని మంత్రి పెద్దిరెడ్డికి అందిస్తానని తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com