SHARMILA: సజ్జలకైనా.. జగన్‌కైనా ఇదే సమాధానం

SHARMILA: సజ్జలకైనా.. జగన్‌కైనా ఇదే సమాధానం

తెలంగాణలో తాను కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడంపై.. విమర్శలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ మండిపడ్డారు.తెలంగాణలో తాను పార్టీ పెట్టినప్పుడు ఏం సంబంధం లేదన్న సజ్జల ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారని షర్మిల ప్రశ్నించారు. ఏపీ పరిస్థితిపై కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు ముందు సమాధానం ఇవ్వాలని సూచించారు. తెలంగాణలో భారాసను దింపే శక్తి ఒక్క కాంగ్రెస్ కు మాత్రమే ఉందని, అందుకే ఆ పార్టీకి బేషరతు మద్దతు ప్రకటించినట్టు.. షర్మిల స్పష్టంచేశారు. తెలంగాణలో... కాంగ్రెస్ కే తమ మద్దతు ఉంటుందని ప్రకటించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ... తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిపై ఉన్న ఓటుకు నోటు కేసు కొట్టేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందని ఆమె గుర్తు చేశారు. అన్ని పార్టీల్లో దొంగలుంటారని..... ఆ దొంగలు సీఎంలు కాకూడదని వ్యాఖ్యానించారు. ఎవరో తమకు కిరీటాలు పెట్టాలని కోరుకోవడం లేదని తెలంగాణ ప్రజల కోసమే ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని షర్మిల అన్నారు.

Next Story