IND vs NZ: ఫైనల్ చేరిన భారత్.. ఇంకొక్క అడుగు దూరంలో

IND vs NZ:   ఫైనల్ చేరిన భారత్.. ఇంకొక్క  అడుగు దూరంలో
టీం ఇండియా చేతిలో చిత్తయిపోయిన కివీస్..

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించి ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రోహిత్‌-గిల్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేసి వేసిన బలమైన పునాదిపై విరాట్‌ కోహ్లీ, శ్రేయస్స్‌ అయ్యర్‌ భారీ స్కోరు నిర్మించారు. విరాట్ కోహ్లీ, శ్రేయస్స్ అయ్యర్‌ శతకాలతో చెలరేగారు. తన అనుభవాన్నంత రంగరించి కోహ్లీ శతకాన్ని బాదగా.. అయ్యర్‌ దొరికిన బంతిని దొరికినట్లు బాది అద్భుత సెంచరీ చేశాడు. రోహిత్‌, గిల్‌, కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత బ్యాటింగ్‌తో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ తీసుకుంది. ఆరంభం నుంచే టీమిండియా సారధి రోహిత్‌ శర్మ దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు. తొలి ఓవర్‌ నుంచే రోహిత్‌ విధ్వంసం ప్రారంభమైంది. గిల్‌తో కలిసి రోహిత్ శర్మ టీమిండియాకు అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి ఓవర్‌లోనే పది పరుగులు రాబట్టిన రోహిత్‌... దొరికి బౌలర్‌ను దొరికినట్లు బాదేశాడు. గిల్‌ కూడా ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.అయితే ఓ దశలో గిల్‌కు తొడ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.

గిల్‌ వెనుదిరిగగానే కోహ్లీ, అయ్యర్‌ భారత స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. కోహ్లీ అద్భుత బౌండరీలతో ఆకట్టుకోగా.. అయ్యర్‌ భారీ షాట్లతో అలరించాడు. భారీ షాట్లు ఆడుతూనే వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీశారు. ఎక్కడా రన్‌రేట్‌ తగ్గకుండా భారీ షాట్లు ఆడారు. ఓవర్‌కు కనీసం ఒక భారీ షాట్‌ ఆడేలా ప్రణాళిక రచించి దానిని పక్కాగా అమలు చేశారు. ఈక్రమంలో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ వన్డేల్లో చేసిన అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమించాడు. సెంచరీ చేసిన అనంతరం మైదానంలోనే కోహ్లీ... సచిన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ బ్యాట్‌ చూపించాడు


కోహ్లీ అవుట్ తర్వాత కాసేపటికే శ్రేయస్స్‌ అయ్యర్‌ కూడా సెంచరీ చేశాడు. అనంతరంచివరి ఏడు బంతులు ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన సూర్యా భారీ షాటుకు యత్నించి అవుటయ్యాడు. చివర్లో రాహుల్‌ కూడా ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 20 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. రాహుల్‌ కొట్టిన 39 పరుగుల్లో 32 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. రోహిత్‌, గిల్‌, కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, రాహుల్‌ విధ్వంస బ్యాటింగ్‌తో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది.

భారత బౌలర్ల ధాటికి కీవీస్‌ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. టిమ్‌ సౌథీ 10 ఓవర్లలో వంద పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్‌ 10ఓవర్లలో 86 పరుగులు ఇచ్చి 1 వికెట్‌ తీసుకున్నాడు. ఫెర్గూసన్ 8 ఓవర్లలో 65, రచిన్‌ రవీంద్ర 7 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story