Kabaddi : కబడ్డీలో భారత్ విజయకేతనం..8వ సారి కప్ కొట్టిన భారత్

Kabaddi : కబడ్డీలో భారత్ విజయకేతనం..8వ సారి కప్ కొట్టిన భారత్

ఆసియా పురుషుల కబడ్డీ ఛాంపియన్‌షిప్‌-2023 ఫైనల్లో గెలిచి భారత్ విజయకేతనం ఎగురవేసింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో భారత ఆటగాళ్లు ఇరాన్‌ను చిత్తుచేశారు. ఫైనల్లో ఇరాన్ జట్టును 42-32 పాయింట్ల తేడాతో ఓడించింది. బుసాన్‌లో జరిగిన ఈ ఛాంపియన్‌షిప్‌ విజయంతో భారత్ ఆడిన 9 టోర్నీల్లో 8 సార్లు కప్ కైవసం చేసుకున్నట్లయింది. భారత కెప్టెన్ పవన్ షెరావత్ 10 పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఆట ప్రారంభమైన 10 వ నిమిషంలో భారత డిఫెండర్లు పలు టాకిల్స్ చేయడం, పవన్ షెరావత్, అస్లాం ఇనాందార్‌లు పాయింట్లు తేవడంలో సఫలం కావడంతో ఇరాన్ జట్టును ఆలౌట్ చేశారు. దీంతో భారత్ 11-4 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత భారత ఆటగాళ్లు దూకుడు పెంచి ఆడారు. ఈ క్రమంలో ఇరాన్ జట్టుకు కూడా కొన్ని బోనస్ పాయింట్లు పొందగలిగింది. 19వ నిమిషంలో మరోసారి ఇరాన్‌ను ఆలైట్‌ చేసి స్కోర్‌ను 23-10 ఆధిక్యంలో నిలిపారు.



2వ అర్ధభాగంలో ఇరాన్ దూకుడు పెంచి ఆడటంతో ఆట ఇరుజట్ల మధ్య హోరాహోరీగా సాగింది. ఇరాన్ కెప్టెన్ వరుసగా 2 పాయింట్లు, 1 సూపర్ రైడ్ ద్వారా ఎక్కువ పాయింట్లు రాబట్టాడు. మ్యాచ్ రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా భారత్ ఆధిక్యం 38-31 కి తగ్గింది. దీంతో మ్యాచ్ చివరి రెండు నిమిషాల్లో రసవత్తరంగా మారింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత ఆటగాళ్లు ఆధిక్యాన్ని కాపాడుకోవడంతో విజయం భారత్ వశమైంది. ఆసియా ఛాంపియన్‌షిప్ కప్ భారత్ దాసోహమైంది.

ఫైనల్‌కు మందు జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో హాంకాంగ్‌ను 64-20 పాయింట్ల భారీ తేడాతో ఓడించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇరాన్‌ రెండవ స్థానంలో నిలిచింది. లీగ్‌ స్టేజ్‌లో భారత్‌ కొరియాపై 76-13 పాయింట్లతో భారీ తేడాతో నెగ్గింది.

భారత్‌కు తర్వాత సవాల్ సెప్టెంబర్‌ 23 అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జూలో జరగనున్న ఆసియా క్రీడల్లో ఎదురవనుంది. 2018 ఆసియా క్రీడల సెమీస్‌లో భారత్‌ను ఇరాన్‌ ఓడించి డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగనుంది. ఈసారి ఎలాగైనా కప్ గెలవాలన్న పట్టుదలతో భారత ఆటగాళ్లు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story