IPL Betting Dream XI: మొన్న బార్బర్.. నేడు ప్లంబర్.. డ్రీమ్ 11 ఆటలో కోటి రూపాయల విన్నర్స్..

IPL Betting Dream XI: మొన్న బార్బర్.. నేడు ప్లంబర్.. డ్రీమ్ 11 ఆటలో కోటి రూపాయల విన్నర్స్..
IPL Betting Dream XI: పెద్ద పెద్ద మైదానాల్లో ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఆడే అవకాశం అందరికీ రాదు.. మొబైల్‌లో అయితే ఎవరైనా ఆడేయొచ్చు.

IPL Betting Dream XI: పెద్ద పెద్ద మైదానాల్లో ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఆడే అవకాశం అందరికీ రాదు కదా.. అదే మొబైల్‌లో అయితే ఎవరైనా ఆడేయొచ్చు. మొన్నటికి మొన్న బీహార్ మధుబనికి చెందిన బార్బర్ అశోక్ కుమార్ అదృష్టాన్ని ఐపీఎల్ డ్రీమ్ 11 మార్చేసింది.

IPL క్రికెటర్ల అదృష్టాన్ని మాత్రమే మారుస్తుందా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాల్సి వస్తుంది డ్రీమ్ 11లో డబ్బులు గెలుచుకున్న వారిని చూస్తుంటే. ఐపీఎల్ కారణంగా చాలా మంది క్రికెటర్లు రాత్రికి రాత్రే మిలియనీర్లు అయ్యారు. మైదానంలో ఆడకపోయినా డ్రీమ్ 11 ఆడి కోటి రూపాయల ప్రైజ్ మనీ పొందుతున్నారు క్రికెట్ ప్రియులు.

ఇప్పుడు ఏడాది పొడవునా మొబైల్‌లో వివిధ పోటీలు జరుగుతున్నాయి. క్రికెట్ అభిమానులు వివిధ సిరీస్‌లలో తమకు నచ్చిన విధంగా ఏదైనా జట్టులోని మొదటి ఎలెవన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. తాజాగా

కటిహార్ జిల్లాలోని మణిహరి బ్లాక్ ప్రాంతానికి చెందిన ప్లంబర్ మిస్త్రీ మొబైల్ యాప్‌లో ఐపిఎల్ క్రికెట్‌కు సంబంధించిన డ్రీమ్ ఎలెవన్ ఆడి రూ.కోటి గెలుచుకున్నారు.

బావమరిది తన మొబైల్‌లో డ్రీమ్ XI యాప్‌ను లోడ్ చేసి ఎలా ఆడాలో కూడా చెప్పాడు. మిస్త్రీ గత పది రోజులుగా డ్రీమ్ XI ఆడుతున్నాడు. డ్రీమ్ ఎలెవన్‌లో విన్నర్ అయిన వార్త రెండు రోజుల క్రితం తెలిసి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి బబ్లూ కుటుంబంలో.

గెలుచుకున్న కోటి రూపాయల్లో ముప్పై లక్షల రూపాయల పన్ను తీసివేసిన తర్వాత, ఖాతాలో డెబ్బై లక్షల రూపాయలు జమ అయ్యాయని సంతోషంగా చెబుతున్నాడు బబ్లూ. డ్రీమ్ ఎలెవన్ టీమ్ తరపున, మొబైల్‌లో ధన్యవాదాలు తెలిపినట్లు ఆయన చెప్పారు. ఈ డబ్బుతో మొదట మా కోసం ఉండడానికి ఓ ఇంటిని నిర్మించచుకుంటాను. కొంత డబ్బును దేవాలయానికి విరాళంగా ఇస్తాను అని బబ్లూ చెప్పాడు.

Tags

Read MoreRead Less
Next Story