క్రీడా సంగ్రామానికి ముస్తాబైన టోక్యో నగరం.. కలవర పెడుతున్న కరోనా కేసులు

క్రీడా సంగ్రామానికి ముస్తాబైన టోక్యో నగరం.. కలవర పెడుతున్న కరోనా కేసులు

Tokyo Olympics

Tokyo Olympics 2021: క్రీడా సంగ్రామానికి జపాన్ రాజధాని టోక్యో ముస్తాబైంది. శుక్రవారం నుంచి ప్రారంభించేందుకు సర్వం సిద్దమైంది.

Tokyo Olympics 2021: క్రీడా సంగ్రామానికి జపాన్ రాజధాని టోక్యో ముస్తాబైంది. శుక్రవారం నుంచి ప్రారంభించేందుకు సర్వం సిద్దమైంది. ఇందుకోసం స్థానిక ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లుచేసింది. క్రీడా గ్రామాన్ని అందంగా ముస్తాబుచేసింది. క్రీడాకారులకు వసతితోపాటు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ప్రముఖ క్రీడాకారులు పాల్గొంటున్న నేపథ్యంలో భద్రతతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉంటే..ప్రపంచ మానవాళిని వణికించిన కరోనా కేసులు ఇక్కడ పెరుగుతుండటం తీవ్రకలకలం రేపుతోంది.

ప్రతి నాలుగు ఏళ్లకుఒకసారి జరుగాల్సిన ఒలింపిక్స్ ... కరోనా కారణంగా ఒక సంవత్సరం ఆలస్యంగా జరుగుతోంది. జపాన్ రాజధాని టోక్యోలో వీటిని నిర్వహిస్తున్నారు. ఈనెల 23వ తేదీనుంచి ఆగస్టు నెల 8వ తేదీవరకు క్రీడాపోటీలు జరుగనున్నాయి. మన దేశం నుంచి 119మంది ఈ ఓలంబిక్స్‌లో పాల్గొంటున్నారు. ఇందుకోసం అన్ని చర్యలు తీసుకున్నారు. ఒలింపిక్స్ తాజాగా జపాన్‌ రాజధాని నగరంలో కొత్త కేసులు ఆరు నెలల గరిష్ఠానికి చేరడం కలకలం రేపుతోంది. ఈ రెండు రోజుల్లోనే అక్కడ 1వెయ్యి 832 కేసులు నమోదయ్యాయి.

కరోనా విజృంభణ దృష్ట్యా ఆగస్టు 22 వరకు అత్యయిక స్థితిని విధిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అత్యయిక స్థితి సమయం ముగిసేలోపే అంతర్జాతీయ ఒలింపిక్‌ క్రీడలు ముగిసిపోనున్నాయి. కరోనా మహమ్మారి కలకలంతో టోక్యో ప్రాంతానికి అభిమానుల రాకను సైతం నిషేధించారు. ఈ మెగా క్రీడలకు ప్రేక్షకులను అనుమతించబోమని, టీవీల్లోనే చూడాలని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టంచేసింది.

తాజా పరిస్థితుల నేపథ్యంలో జపాన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు టోషియా నకగవా మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌తో సంబంధం లేకుండానే ఈ పెరుగుదలను అంచనా వేసినట్టు తెలిపారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో నెలకొన్న అనిశ్చితి వల్లే యువత, వ్యాక్సిన్‌ వేసుకోని వారిలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు, జపాన్‌లో ఇప్పటివరకు దాదాపు 23 శాతం మంది పూర్తిగా వ్యాక్సిన్‌ వేసుకున్నారు .

రాబోయే కొన్ని వారాల్లో టోక్యోలో కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయని ఆరోగ్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. టోక్యో మెట్రోపాలిటన్‌ ప్రభుత్వ నిపుణుల బృందం సభ్యుడు డాక్టర్‌ నోరియో ఒహమగరి మాట్లాడుతూ.. ఇదే వేగంతో కేసులు పెరిగితే మరో రెండు వారాల్లో టోక్యోలో రోజుకు సగటున 2,600 చొప్పున కేసులు నమోదవుతాయన్నారు. జపాన్‌లో ఇప్పటివరకు 84,800 కేసులు, 15వేల మరణాలు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story