కేవలం 20 పైసలకే కిలోమీటర్‌ నడపొచ్చు..ఈ బండికి పెరుగుతున్న డిమాండ్‌

కేవలం 20 పైసలకే కిలోమీటర్‌ నడపొచ్చు..ఈ బండికి పెరుగుతున్న డిమాండ్‌

Electric Vehicles: పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ క్రమంలో బండి బయటకు తీయాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. కరోనా టైంలో చాలా మంది ప్రజారవాణా కంటే సొంత వాహనాలనే ఉపయోగిస్తున్నారు. అనేక మంది పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలు వాడుతున్నారు. దీంతో కావడంతో కాలుష్యం పెరుగుతోంది. మరోవైపు విద్యుత్ వాహనాల విక్రయాలు పెరిగిపోయాయి. వాటి నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటుంది. దీంతో పాటు కాలుష్య నియంత్రణ సాధ్యమతోంది. భవిష్యత్తు తరాలకు మేలు చేకూరుతుందని పర్యావరణవేత్తలు చెబుతోన్నారు. మరోవైపు ఉద్యోగులకు నెడ్‌క్యాప్‌ ఈఎంఐ ద్వారా ఎలక్ట్రిక్‌ బైక్‌లు ఇప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి. బ్యాటరీ వాహనాల కొనుగోలుపై యువత, విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.


ఎలక్ట్రిక్‌ బైక్‌ల వినియోగం పెరిగితే కాలుష్యం నియంత్రణలోకి వస్తుంది. ప్రస్తుతం పెట్రోల్‌ ధర లీటరు రూ.106గా ఉంది. పెట్రోల్ ద్వారా నడిపే వాహనానికి కి.మీ.కు రూ.2.50 ఖర్చవుతుంది. అదే ఎలక్ట్రిక్‌ బైక్‌లకు కేవలం 20 పైసలు మాత్రమే పడుతుంది.



ఎలక్ట్రిక్‌ బైక్‌లకు 4 యాంప్‌ సాకెట్‌ ఉంటే ఇంట్లోనే చార్జింగ్‌ పెట్టుకోవచ్చు. ఎలక్ట్రిక్‌ బైక్‌లకు చార్జింగ్‌ స్టేషన్లూ కూడా అందుబాటులోకి రానున్నాయి. బైక్ చార్జింగ్ స్టేషన్లు కూడా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ వే వెంబడి అవి ఏర్పాటు కానున్నాయి.


నెడ్‌క్యాప్‌ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులందరికీ సులభ వాయిదాల్లో విద్యుత్ బైకులు అందించనున్నారు. ఈ ద్విచక్ర వాహనాల వేగం 45 నుంచి 55 కి.మీ. ఉంటుంది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 80-100 కి.మీ. నడుస్తుంది. లిథియం బ్యాటరీలు వస్తున్నాయి. 5గంటలు చార్జింగ్‌ పెడితే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఎలక్ట్రానిక్ బైక్ పూర్తి ఛార్జింగ్ చేస్తే మూడు యూనిట్లు కరెంట్ కాలుతుంది.



ఈఎంఐ: ఈఎంఐ 60 నెలలు చెల్లించే వెసులుబాటు ఇవ్వనున్నారు. ఎలక్ట్రిక్‌ బైక్‌లు మోడల్, ధరను బట్టి నెలకు రూ.2వేల నుంచి రూ.2,500 చొప్పున ఉంటుంది.



సెంట్రల్‌ మోటర్‌ వెహికల్‌ చట్టం ప్రకారం 25కి.మీ వేగం తక్కువ వెళ్లే వాహనాలకు రిజిస్ట్రేషన్‌, డ్రైవింగ్‌ లైసెన్సు, రోడ్‌ ట్యాక్స్‌ అవసరం లేదు.



Tags

Read MoreRead Less
Next Story