కూకట్‌పల్లిలో బోర్డు తిప్పేసిన కేకేఆర్ చిట్ ఫండ్ కంపెనీ

కూకట్‌పల్లిలో బోర్డు తిప్పేసిన కేకేఆర్ చిట్ ఫండ్ కంపెనీ
హైదరాబాద్ కూకట్ పల్లిలో ఓ చిట్‌ఫండ్ సంస్థ బోర్డు తిప్పేసింది. చిట్టీల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కూకట్ పల్లి పోలీస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

హైదరాబాద్ కూకట్ పల్లిలో ఓ చిట్‌ఫండ్ సంస్థ బోర్డు తిప్పేసింది. చిట్టీల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కూకట్ పల్లి పోలీస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. చిత్తూరుకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి, అతని భార్య షణ్ముఖిల, స్నేహితుడు వెంకట రమణరావుతో కలిసి ప్రశాంత్ నగర్‌లో కేకేఆర్ చిట్ ఫండ్ పేరుతో పదిహేను సంవత్సరాల క్రితం కంపెనీ ఏర్పాటుచేశారు.

అప్పటి నుంచి వేలాదిమంది ఆ చిట్ ఫండ్ సంస్థలో చిట్టీల రూపంలో డబ్బులు జమచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి పై ఉన్న నమ్మకంతో దాదాపు 3వందల మంది పెద్దమొత్తంలో జమ చేశారు. గత నెలనుంచి కిరణ్ కుమార్ రెడ్డి కార్యాలయం తెరువకపోవడం, అతని ఫోన్ స్విచ్‌ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం జరుగకపోతే ఆత్మహత్యలే దిక్కని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story