కార్యకర్తలే నా బలం, ప్రజలే నా బలగం: మంత్రి ఎర్రబెల్లి

కార్యకర్తలే నా బలం, ప్రజలే నా బలగం: మంత్రి ఎర్రబెల్లి
జనగామ జిల్లా సీతారాంపురంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి

కార్యకర్తలే తన బలం, ప్రజలే తన బలగం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా సీతారాంపురంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి... సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. రైతు బీమా, రైతు బంధు, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మీ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. పాలకుర్తిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నాని.. పాలకుర్తి అభివృద్ధే తన ధ్యేయమన్నారు.

Tags

Read MoreRead Less
Next Story