రైఫిల్తో కాల్చుకొని CRPF కానిస్టేబుల్ ఆత్మహత్య
By - Subba Reddy |27 April 2023 7:15 AM GMT
చీకోటి గార్డెన్ వద్ద దేవేంద్ర కుమార్ రైఫిల్తో కాల్చుకున్నాడు
హైదరాబాద్ బేగంపేటలో CRPF కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపింది. చీకోటి గార్డెన్ వద్ద దేవేంద్ర కుమార్ రైఫిల్తో కాల్చుకున్నాడు. 2021 బ్యాచ్కు చెందిన దేవేంద్ర కుమార్.. CRPF ఐజీ మహేష్ లడ్డా నివాసం వద్ద సెక్యూరిటీగార్డ్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. దేవేంద్ర ఆత్మహత్యకు ప్రేమ విఫలమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గాంధీ మార్చురీకి తరలించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com