సైబరాబాద్‌లో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు

సైబరాబాద్‌లో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు
సైబరాబాద్‌లో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు

సైబరాబాద్‌లో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు . ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 10 మంది కాక్రల్ గ్యాంగ్ సభ్యుల్ని శంషాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు తుపాకులు, 15 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్‌తో పాటు సంగారెడ్డిలో పలు నగల షాపుల్లో ఈ గ్యాంగ్‌ చోరీలకు పాల్పడినట్టు గుర్తించారు. న‌గ‌రంలోని జ‌గ‌ద్గిరిగుట్ట అంబేద్కర్‌ కాల‌నీలో ఈ ముఠా షెల్టర్‌ తీసుకుంది.

ఈ ముఠా స‌భ్యులంతా దొంగ‌త‌నాల్లో ఆరితేరార‌ని సీపీ సజ్జనార్‌ చెప్పారు. చోరీకి పాల్పడే ప్రాంతంపై పక్కాగా రెక్కీ నిర్వహించి…అవసరమయ్యే ఆయుధాలను ముందే సిద్ధం చేసుకుంటారని తెలిపారు. అంతేకాదు చోరీ స‌మ‌యంలో అడ్డువ‌చ్చేవారిని చంపేందుకైనా వెనుకాడ‌ర‌ు. ఉత్తరప్రదేశ్, మ‌హారాష్ట్ర త‌దిత‌ర ప్రాంతాల్లోనూ వీరు నేరాల‌కు పాల్పడ్డారని, వాటిపై ఇంకా విచారించాల్సి ఉందని సీపీ సజ్జనార్ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story