తెలంగాణలో కొత్తగా 12 మంది కరోనాతో మృతి

తెలంగాణలో కొత్తగా 12 మంది కరోనాతో మృతి

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా... 18 వందల 96 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 6 వేల 644కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్క రోజులో కరోనాతో 12 మంది చనిపోయారు. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 12 వందల ఒకటికి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 2 వేల 67 మంది కోలుకోగా... మొత్తం ఇప్పటి వరకు ఒక లక్షా 79 వేల 75 మంది రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26 వేల 368 యాక్టివ్ కేసులు ఉండగా.... వారిలో 21 వేల 724 మంది హోం ఐలోలేషన్‌లో ఉన్నారు. నిన్న ఒక్క రోజులో... 50 వేల 367 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 33 లక్షల 96 వేల 839కి చేరినట్టు... హెల్త్‌ బులెటిన్‌లో ప్రభుత్వం పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story