Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 3,816 కేసులు.. 27 మంది మృతి..!
By - TV5 Digital Team |16 May 2021 2:28 PM GMT
Telangana Corona Cases : తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 44,985 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,816 కొత్త కేసులు బయటపడ్డాయి.
Telangana Corona Cases : తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 44,985 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,816 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 5,28,823కు చేరింది. మరో 27 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. మరోవైపు కరోనా నుంచి 5,892 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో పాజిటివ్ రేటు 0.55 శాతంగా నమోదవ్వగా.. రికవరీ రేటు 89.80శాతంగా ఉంది. ఇక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 44,985 టెస్టులు చేయగా.. ప్రస్తుతం 50,969 యాక్టివ్ కేసులున్నాయి. కాగా జీహెచ్ఎంసీలో అత్యధికంగా 658 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com