తెలంగాణలో కొత్తగా 5,695 కరోనా కేసులు.. 49 మంది మృతి

తెలంగాణలో కొత్తగా 5,695 కరోనా కేసులు.. 49 మంది మృతి
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 5వేల 695 కేసులు బయటపడ్డాయి. కరోనా కారణంగా నిన్న 49 మంది చనిపోయారు.

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 5వేల 695 కేసులు బయటపడ్డాయి. కరోనా కారణంగా నిన్న 49 మంది చనిపోయారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 4 లక్షల 56వేల 485 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 2వేల 417 మంది కరోనా కారణంగా చనిపోయారు. తెలంగాణవ్యాప్తంగా ప్రస్తుతం 80వేల 135 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 1352 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 483 కేసులు, మేడ్చల్‌లో 427 కేసులు, సంగారెడ్డిలో 401, వరంగల్ అర్బన్‌లో 393, నిజామాబాద్‌లో 330, నిజామాబాద్‌లో 258 కేసులు బయటపడ్డాయి.

Tags

Read MoreRead Less
Next Story