తెలంగాణలో కొత్తగా 7,646 కేసులు.. 53 మరణాలు..!

తెలంగాణలో కొత్తగా 7,646 కేసులు.. 53 మరణాలు..!
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొత్తగా 7వేల 646 కేసులు.. 53 మరణాలు సంభవించాయి.

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొత్తగా 7వేల 646 కేసులు.. 53 మరణాలు సంభవించాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,441, మేడ్చల్ 631, రంగారెడ్డి 484, సంగారెడ్డి 401, నిజామాబాద్ 300, సిద్దిపేట 289, నల్గొండ 285, కరీనంగర్ జిల్లాలో 274 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో 4లక్షల 35వేల 606 కేసులు వచ్చాయి. ఇప్పటివరకు కరోనాతో 2261 మంది మృతిచెందారు. ప్రస్తుతం 77వేల727 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story