ఇక్కడ చికెన్ కొంటె 50 శాతం డిస్కౌంట్‌.. కానీ అందరికీ కాదు.. ఎవరికో తెలిస్తే హాట్సాఫ్ అంటారు!

ఇక్కడ చికెన్ కొంటె  50 శాతం డిస్కౌంట్‌.. కానీ అందరికీ కాదు.. ఎవరికో తెలిస్తే హాట్సాఫ్ అంటారు!
ఏ వ్యాపారులైనా సరే.. వారు చేసే వ్యాపారంలో లాభాలే రావాలని అనుకుంటారు తప్ప నష్టపోవాలని అనుకోరు.. ముందుగా నష్టాల్లో వ్యాపారాన్ని నడిపేందుకు ఎవరూ ముందుకు రారు కూడా..

ఏ వ్యాపారులైనా సరే.. వారు చేసే వ్యాపారంలో లాభాలే రావాలని అనుకుంటారు తప్ప నష్టపోవాలని అనుకోరు.. ముందుగా నష్టాల్లో వ్యాపారాన్ని నడిపేందుకు ఎవరూ ముందుకు రారు కూడా.. కానీ ఓ చికెన్ వ్యాపారి మాత్రం.. తనకు నష్టాలు వచ్చినా పర్లేదని ఆఫర్స్ పెట్టేస్తున్నాడు. ఏకంగా చికెన్‌పై 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాడు అయితే అందరికీ కాదు.. దీంతో అతనికి, అతని వ్యాపారానికి ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది.

ఇక వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్‌ కి చెందిన రమేష్ అనే వ్యక్తి.. నెల రోజుల క్రితం మాలతి చికెన్ సెంటర్‌ను ప్రారంభించాడు. ఇందులో కోడి గుడ్లు, లైవ్ కోళ్లు, చికెన్ అమ్ముతుంటాడు. అయితే బిజినెస్ లో భాగంగా వినియోగదారులను ఆకట్టుకోవడానికి అందరిలాగే ఆఫర్స్ పెట్టాడు. కిలో చికెన్‌ తీసుకుంటే 2 గుడ్లు ఫ్రీ, చికెన్ ఆర్డర్ చేస్తే హోమ్ డెలివరీ ఫ్రీ వంటి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేశాడు. ఈ ఆఫర్స్ తో అతను ఓ మంచి బిజినెస్ మెన్ అని అనిపించుకున్నాడు. కానీ మరో ఆఫర్ పెట్టి నిజంగానే సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు.

ఇంతకీ ఆ ఆఫర్ ఏంటంటే.. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న సైనికులకు, మాజీ సైనికులకు 50 శాతం తగ్గించి చికెన్‌ను అమ్ముతున్నాడు. తానూ ఎలాగూ దేశ సేవ చేయడానికి ఆర్మీలో లేనని, ఇలా చేయడం వలన సంతోషం కలుగుతుందని అంటున్నాడు. అంతేకాకుండా మనం ఈ రోజు కంటినిండ.. ఎలాంటి భయం లేకుండా నిద్ర పోతున్నామంటే దానికి కారణం వారే కదా అని అంటున్నాడు. అందుకే వారిపై గౌరవంగా తన వంతుగా సైనికుల కుటుంబాలకు సహాయం చేస్తున్నానని రమేష్ తెలిపాడు.

Tags

Read MoreRead Less
Next Story