కరోనా టెస్టు కోసం వచ్చి తల్లి ఒడిలోనే తుదిశ్వాస..!

కరోనా టెస్టు కోసం వచ్చి తల్లి ఒడిలోనే తుదిశ్వాస..!
కరోనా టెస్ట్‌లో నెగటివ్‌ వచ్చింది. కానీ ప్రాణాలు మాత్రం దక్కలేదు. తల్లి ఒడిలోనే ఆ వ్యక్తి కన్నుమూయడంతో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

కరోనా టెస్ట్‌లో నెగటివ్‌ వచ్చింది. కానీ ప్రాణాలు మాత్రం దక్కలేదు. తల్లి ఒడిలోనే ఆ వ్యక్తి కన్నుమూయడంతో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. రెంజల్‌ మండలం బొర్గం గ్రామానికి చెందిన అశోక్‌ అనే వ్యక్తి కొద్ది రోజులుగా తీవ్ర జ్వరం ఉండటంతో రెంజల్‌ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. కరోనా అనుమానంతో శాంపిల్‌ ఇచ్చి చెట్టు కింద సేదతీరాడు. అతని వెంట తల్లి కూడా ఉంది. అయితే.. రిపోర్టు వచ్చే లోపు అతను తల్లి ఒడిలోనే తుదిశ్వాస విడిచాడు. గుండెపోటు రావడంతోనే చనిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. బాధితుడు చనిపోయిన కొద్దిసేపటికే కరోనా నెగటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. కొడుకు ఇక లేడన్న వార్తతో ఆ తల్లి కన్నీరుమున్నీరైంది.

Tags

Read MoreRead Less
Next Story