పీటల మీద పెళ్ళాపిన యువతికి ప్రియుడితో పెళ్లి!

పీటల మీద పెళ్ళాపిన యువతికి ప్రియుడితో పెళ్లి!
మహబూబాబాద్ జిల్లా మరిపెడ గుండెపుడి గ్రామానికి చెందిన యామిని రాకేష్, కురవి మండలం కాంపెల్లి గ్రామానికి చెందిన ఎర్రకుంట దివ్యకు పెళ్లి నిశ్చయమైంది.

పీటల దాకా వచ్చి ఆగిన పెళ్లిళ్లు చూశాం. కానీ మండపంలో పీటలపై కూర్చున్న వధువు పెళ్లికి నిరాకరించి వెళ్లిపోవడం.. పెళ్లి చూడటానికి వచ్చిన యువతి వధువుగా మారడం చాలా అరుదైన విషయమే. సినిమా సన్నివేశాల్ని తలపించే ఈ పెళ్లి తంతు మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో జరిగింది.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ గుండెపుడి గ్రామానికి చెందిన యామిని రాకేష్, కురవి మండలం కాంపెల్లి గ్రామానికి చెందిన ఎర్రకుంట దివ్యకు పెళ్లి నిశ్చయమైంది. వీరి వివాహ వేడుకకు మరిపెడలోని కనకదుర్గ ఫంక్షన్ హాలు వేదికైంది. గురువారం ఉదయం 11 గంటల 55 నిమిషాలకు వివాహ ముహూర్తం ఖరారు చేశారు. పెండ్లి తంతు జరుగుతుండగానే తాళి కట్టే సమయానికి వధువు పీటల మీద నుంచి లేచి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని బంధువులకు చెప్పింది. డయల్‌ 100 నెంబరుకు కాల్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మండపం వద్దకు చేరుకున్న పోలీసులు వధువును స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేశారు.

తాను కాంపెల్లి గ్రామానికి చెందిన ఓ యువకుని ప్రేమించానని, ఈ విషయాన్ని పెళ్లి చూపులకు ముందే తల్లిదండ్రులకు చెప్పానని వధువు దివ్య తెలిపింది. అయినా వినకుండా బలవంతంగా వివాహం చేస్తున్నారని స్పష్టంచేసింది. ఈ వివాహానికి హాజరైన బంధువులు అనూహ్య పరిణామాలతో కంగుతున్నారు.

పెళ్లి పీటలపై నుంచి వధువు వెళ్లిపోవడంతో బంధువులంతా ఖంగుతిన్నారు. పెళ్లికి వచ్చిన బంధువుల అమ్మాయితో అప్పటికప్పుడు సంబంధం మాట్లాడారు. ఇరు కుటుంబాలకు ఇష్టం కావడంతో అదే మండపంలో పెళ్లి చేశారు. పీటలపై పెళ్లి ఆగిపోగా మరో యువతి అనూహ్యంగా పెళ్లి కూతురుగా మారింది. పెళ్లి పీటల మీద నుంచి వెళ్లిపోయిన వధువు దివ్య తాను ప్రేమించి యువకుడిని పెళ్లి చేసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story