నటి శ్రావణి కేసులో A1 సాయిరెడ్డే..

నటి శ్రావణి కేసులో A1 సాయిరెడ్డే..
సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించిన సీరియల్‌ నటి శ్రావణి ఆత్మహత్య కేసును ఛేదించారు పోలీసులు. హైదరాబాద్‌ ఎస్ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 8 తేదీన బుల్లితెర నటి శ్రావణి ..

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించిన సీరియల్‌ నటి శ్రావణి ఆత్మహత్య కేసును ఛేదించారు పోలీసులు. హైదరాబాద్‌ ఎస్ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 8 తేదీన బుల్లితెర నటి శ్రావణి తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆత్మహత్య తరువాత పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో గంట గంటకు కొత్త కోణాలు వెలుగు చూశాయి. ఆసక్తికర అంశాలు కనిపించాయి. ఈ కేసులో ఎన్నో ట్విస్టులు, మరెన్నో మలుపులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు మధ్య సాగిన పోలీసుల దర్యాప్తు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. మొదటి నుంచి ఊహించినట్లే ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రావణి స్నేహితుడు సాయి రెడ్డిగా తేల్చారు పోలీసులు. ఇక అనుకోకుండా ఈ కేసులో ఎంటరైన నిర్మాత అశోక్ రెడ్డి రెండో నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. అటు.. శ్రావణి ఇష్ట పడి పెళ్లి చేసుకోవాలని భావించిన దేవరాజురెడ్డిని A3గా తేల్చారు.

2012లో సినిమాలపై ఉన్న మక్కువతో శ్రావణి హైదరాబాద్‌కి వచ్చింది. కొన్ని రోజులు శిక్షణ తీసుకున్న తరువాత టెలివిజన్ రంగంలో అవకాశం రావడంతో సీరియల్ ఆర్టిస్ట్‌గా పని చేస్తూ వస్తోంది. అయితే శ్రావణి ఇంటి సమీపంలో ఉండే సాయికృష్ణారెడ్డి అనే వ్యక్తితో 2015లో పరిచయం ఏర్పడింది. మంచి స్నేహితుడిగా ఉంటూ సాయి ..శ్రావణి మంచి చెడులు చూసుకుంటున్నాడు. ఈ గ్యాప్‌లోనే RX100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డితో 2017లో పరిచయం ఏర్పడింది. అతను కూడా ఓ సీరియల్ , సినిమా ఆఫర్ ఇస్తాను అని చెప్పి శ్రావణికి దగ్గర అయ్యాడు. ఇలా వీరి మధ్య సాన్నిహిత్యం కొనసాగుతున్న నేపథ్యంలో టిక్‌టాక్‌ మీద ఉన్న మోజుతో శ్రావణి రోజు తన వీడియోలు తీసి సోషల్‌ మీడియాలోపెట్టేది. ఇది చూసిన కాకినాడకి చెందిన దేవరాజు రెడ్డి శ్రావణికి మెసేజ్‌లు చేసేవాడు. 2019లో పరిచయం కావడంతో అది కాస్తా స్నేహంగా మారింది. కొద్దీ రోజుల్లోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దేవరాజు రెడ్డి ఎప్పుడైతే శ్రావణికి దగ్గర అయ్యాడో అప్పుడు శ్రావణి సాయి, అశోక్ రెడ్డిని దూరం పెడుతూ వస్తుంది. దీంతో శ్రావణిని నిలయదీయడంతో దేవరాజుతో ఉన్న ప్రేమ వ్యవహారం మొత్తం సాయికి చెప్పింది.

అప్పటికే శ్రావణిపై పెంచుకున్న ప్రేమ మరొకరి చేతుల్లోకి వెళుతుందని భావించిన సాయి.. దేవరాజుకు ఆమె దగ్గర అవ్వడాన్ని సహించలేక పోయాడు. దీంతో ఉన్నది లేనిది కల్పించి శ్రావణి తల్లిదండ్రుల ముందు దేవరాజ్‌గురించి చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు శ్రావణిని మందలిస్తూ వస్తున్నారు. అయినా శ్రావణిలో మార్పు రాలేదు. దేవరాజుని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించింది. ఇక తనకు శ్రావణి దక్కదు అని భావించి సాయి.. నిర్మాత అశోక్ రెడ్డి తో కలిసి శ్రావణిని వేధింపులకు గురి చేస్తూ వస్తున్నారు. ఒకానొక సందర్భంలో శ్రావణిపై ఒత్తిడి తెచ్చి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో దేవరాజుపై కేసు పెట్టించారు.

ఒక వైపు తల్లిదండ్రులు, మరో వైపు సాయి, అశోక్ రెడ్డి వేధింపుల ఒత్తిడి రోజు రోజుకు పెరిగాయి. ఎలాగైనా ఇంటి నుండి వెళ్ళిపోయి దేవరాజు ని పెళ్లి చేసుకోవాలని దేవరాజు తల్లికి విషయం చెప్పింది శ్రావణి. కానీ అప్పుడు దేవరాజు పెళ్లికి నిరాకరించాడు. ఒకసారి శ్రావణి.. దేవరాజు కలిసి హోటల్ లో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్లి సాయి, శ్రావణి తమ్ముడు నడి రోడ్డుపై హంగామా చేశారు. దేవరాజుపై దాడి కూడా చేశారు. ఈ ట్రైయాంగిల్ లవ్ స్టొరీలో సతమతమై శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. సాయి, అశోక్ రెడ్డి తో పాటు శ్రావణిని తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టారని, అవన్నీ తమ విచారణలో బయటపడ్డాయని డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం అశోక్ రెడ్డి పరారీలో ఉన్నారన్నారు.

Tags

Read MoreRead Less
Next Story