బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తల గొడవ

X
By - kasi |22 Nov 2020 3:39 PM IST
హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో గన్ఫౌండ్రికి చెందిన రెండు వర్గాల కార్యకర్తలు గొడవకు దిగారు. గన్ఫౌండ్రి నుంచి ఓంప్రకాశ్కు..
హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో గన్ఫౌండ్రికి చెందిన రెండు వర్గాల కార్యకర్తలు గొడవకు దిగారు. గన్ఫౌండ్రి నుంచి ఓంప్రకాశ్కు బీజేపీ టికెట్ ఖరారు చేసింది. బీఫామ్ తీసుకునేందుకు ఓంప్రకాశ్ అనుచరులతో కలిసి కార్యాలయానికి వచ్చారు. ఈ సమయంలో శైలేందర్ యాదవ్ వర్గీయులు ఓంప్రకాశ్ను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఓంప్రకాశ్ ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. ముందు నుంచీ పార్టీలో ఉన్న వారికి టికెట్ ఇవ్వలేదని శైలేందర్ వర్గీయుల ఆందోళన దిగారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com