Bandi Sanjay: బండి తనయుడిపై ఎఫ్.ఐ.ఆర్
తెలంగాణా భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ తనయుడు భగీరథ్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. సహ విద్యార్ధిపై కాలేజ్ క్యాంపస్ లోనూ, హాస్టల్ రూమ్ లోనూ చేయి చేసుకుని, దూషించినందుకు గానూ అతడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మహీంద్రా యూనివర్సిటీలో ఓ విద్యార్ధిపై పిడుగుద్దులు కురిపిస్తున్న భగీరథ్ వీడియో బయటకు రావడంతో పోలీసులు అతడిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. సెక్షన్ 341,323, 504,506, r/w34 కింద కేసు నమోదు చేశారు.
ఒక విషయంలో తన సహాయం కోరిన విద్యార్ధిని భగీరథ్ ఇష్టారీతిన కొట్టడం వీడియోలో రికార్డ్ అయింది. సదరు విద్యార్ధిని దూషిస్తూ, చంపుతానని బెదిరించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఎంపీ తనయుడిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com