Bandi Sanjay : బీజేపీ అధికారంలోకి రాగానే పేదలందరికీ ఇళ్ళు : బండి సంజయ్
By - TV5 Digital Team |15 May 2022 9:30 AM GMT
Bandi Sanjay : తెలంగాణలో అభివృద్ధి జరగాలన్నా, పేదల తలరాతలు మారాలన్నా BJP అధికారంలోకి రావాలన్నారు బండి సంజయ్.
Bandi Sanjay : తెలంగాణలో అభివృద్ధి జరగాలన్నా, పేదల తలరాతలు మారాలన్నా BJP అధికారంలోకి రావాలన్నారు బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్ర 2వ విడత ముగిసిన సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయలంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం హామీకి కట్టుబడి ఉన్నామని, BJP వచ్చాక ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పోస్టులు భర్తీ చేస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ వ్యాట్పై కూడా సీఎం కేసీఆర్ కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లక్షలాది ఇళ్ళు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com