భద్రాచలం శ్రీరామచంద్ర స్వామిని దర్శించుకున్న బండి సంజయ్..!
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ రోజు భద్రాచలం శ్రీరామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయాన్నే ఆలయానికి చేరుకున్న బండి సంజయ్కు.. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం.. ఆయన స్వామివారి మూల విరాట్టును దర్శించుకుని ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భద్రాచలం రాముల వారి దర్శనానికి రాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పించుకు తిరుగతున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఇక్కడకు వస్తే ఆలయ అబివృద్ధిపై ఇచ్చిన హామీలను భక్తులు ఎక్కడ ప్రశ్నిస్తారోనని కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు. రామాయణ సర్క్యూట్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 30 కోట్ల రూపాయలను కూడా ఉపయోగించుకోలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని బండి సంజయ్ విమర్శించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com