దుబ్బాక విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల సంబరాలు

దుబ్బాక విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల సంబరాలు
దుబ్బాక విజయంతో తెలంగాణ బీజేపీలో నూతనోత్సాహం వెల్లివిరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. హైదరాబాద్‌లోని తెలంగాణ ప్రధాన కార్యాలయం..

దుబ్బాక విజయంతో తెలంగాణ బీజేపీలో నూతనోత్సాహం వెల్లివిరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. హైదరాబాద్‌లోని తెలంగాణ ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. డోలు వాయిస్తూ నృత్యాలు చేశారు.

బీజేపీ కార్యాలయం దగ్గర ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని భుజాలపై ఎత్తుకుని విజయనాదం చేశారు కార్యకర్తలు. ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుని కంగ్రాట్స్‌ చెప్పుకున్నారు. జై శ్రీరాం, భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. బీజేపీ కార్యాలయానికి ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలిరావడంతో సందడి వాతావరణ ఏర్పడింది.

దుబ్బాక విజయంతో అటు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కార్యకర్తలు టపాసులు కాల్చి పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. ఖమ్మం, కొత్తగూడెంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించాయి. అటు వరంగల్‌, కరీంనగర్‌, నిజమాబాద్‌ జిల్లాల్లోనూ బీజేపీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ విజయోత్సవ ర్యాలీలు జరిగాయి. బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణలో భవిష్యత్ అంతా బీజేపీదే అన్నారు.

దుబ్బాక ఉప ఎన్నిక విజయం స్ఫూర్తితో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. ఇకపై 2023 సాధారణ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతమని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story