పదవులు నాకు లెక్క కాదు .. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
By - Admin |21 Dec 2020 11:00 AM GMT
పార్టీ అయినా పదవి అయినా గోరక్షణ కోసం కాళ్లకింద తొక్కేస్తానని వ్యాఖ్యానించారు. హిందూ రక్షణ తన కర్తవ్యమని దానికి అడ్డుపడితే పార్టీకి రాజీనామా చేస్తానన్నారు.
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ రక్షణ, గోరక్షణ కోసం ఎంత వరకైనా వెళ్తానని అన్నారు. అంతేకాదు పార్టీ అయినా పదవి అయినా గోరక్షణ కోసం కాళ్లకింద తొక్కేస్తానని వ్యాఖ్యానించారు. హిందూ రక్షణ తన కర్తవ్యమని దానికి అడ్డుపడితే పార్టీకి రాజీనామా చేస్తానన్నారు. పదవులు తనకు లెక్క కాదని అన్నారు. ఇందిరాపార్క్ వద్ద టీటీడీ బోర్డు మెంబర్ శివకుమార్ ఏర్పాటుచేసిన గోసంరక్షణ శాలను రాజాసింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com