పాకిస్తాన్‌కు వంత పాడే పార్టీతో అధికార పార్టీ దోస్తీ: లక్ష్మణ్

పాకిస్తాన్‌కు వంత పాడే పార్టీతో అధికార పార్టీ  దోస్తీ: లక్ష్మణ్

తెలంగాణలో తమ పార్టీ ఎదుగుదలను అధికార పార్టీ ఓర్వలేకపోతోందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. రానున్న రోజుల్లో అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కశ్మీర్ లో 370 రద్దు దేశ సమగ్రతకు దోహదపడుతుందన్నారు. పాకిస్తాన్ కు వంత పాడే పార్టీలతో దోస్తీ చేసే వారు దేశభక్తులు ఎలా అవుతారంటూ టీఆర్ ఎస్ ను విమర్శించారు లక్ష్మణ్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో జరిగిన బీజేపీ సభ్యుల ఆత్మీయ సభకు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. పార్టీలో చేరిన వారికి సభ్యత్వ నమోదు రశీదు అందించారు. అలాగే బీజేపీ ఎక్కడుందని ఉత్తమ్ అడగటం విడ్డూరంగా ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story