Black Fungus In Telangana : తెలంగాణలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ మరణాలు..!

Black Fungus In Telangana  : తెలంగాణలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ మరణాలు..!
Black Fungus In Telangana : తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులు కలవరపెడుతున్నాయి. ఇప్పటివరకూ దీని బారిన పడి ఏడుగురు చనిపోయారు.

Black Fungus In Telangana : తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులు కలవరపెడుతున్నాయి. ఇప్పటివరకూ దీని బారిన పడి ఏడుగురు చనిపోయారు. కోఠి ఈఎన్ టీ ఆసుపత్రికి రెండు రోజుల్లోనే 23 కేసులు వచ్చాయి. కరోనా నుంచి కోలుకున్న వారికి ఆ సంతోషం ఎక్కువ రోజులు మిగలడం లేదు. బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ రూపంలో మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటి వరకు ఢిల్లీ, అహ్మదాబాద్, మహారాష్ట్రలో మాత్రమే వెలుగుచూసిన ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ కేసులు ఇప్పుడు తెలంగాణలో కూడా భారీగా నమోదు అవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఈ మరణాలు భయపెడుతున్నాయి. ఇప్పటివరకు నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడటంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, సిరిసిల్లా, నల్గొండ జిల్లాలలో ఈ కేసులు నమోదయ్యాయి.


Tags

Read MoreRead Less
Next Story