బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో జగత్‌ పాత్ర

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో జగత్‌ పాత్ర
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు జగత్ విఖ్యాత రెడ్డి పాత్ర ఉందని అనుమానిస్తున్నారు.

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు జగత్ విఖ్యాత రెడ్డి పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. కిడ్నాప్ జరిగినప్పటి నుంచి జగత్ విఖ్యాత్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. తాజాగా అతని డ్రైవర్ దుర్గను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు భార్గవ రామ్, గుంటూరు శీను కోసం ప్రత్యేక బందాలు గాలిస్తున్నాయి.

అటు బేగంపేట్ పీఎస్ లో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు విచారిస్తున్నారు. కిడ్నాప్ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు టీం సమాచారాన్ని సేకరిస్తోంది. కిడ్నాప్ చేసిన తర్వాత నార్త్ జోన్ డీపీసీకి ఫోన్ కాల్ రావడంతో పాటు కిడ్నాపర్లు సేఫ్ అంటూ వచ్చిన కాల్స్ పై కూడా డీసీపీ కమలేశ్వర్ విచారించనున్నారు. ఇంకా ఈ కేసులో ఎవరి ప్రమేయైనా ఉందా అనే దానిపై ఆరా తీస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story