హైదరాబాద్‌లో కూలిన భవనం.. మహిళకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌లో కూలిన భవనం.. మహిళకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

భారీ వర్షాలు హైదరాబాద్‌ నగరంలో బీభత్సం సృష్టిస్తున్నాయి. నగరంలో ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడాలేదు.. వర్షపునీటిలో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులపై బయటకు వెళ్లాలన్నా మార్గం లేక అల్లాడిపోతున్నారు.

ఇక పాతబస్తీలో ప్రజలు భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు.. కుండపోత వర్షాలకు చాంద్రాయణగుట్ట గౌస్‌నగర్‌ ప్రాంతంలో రెండు ఇళ్లు కూలిపోయాయి.. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.. ఓ ఇంట్లో ఐదుగురు, మరో ఇంట్లో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది.

పాతబస్తీలో ఓ మహిళకు తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె పక్కనే శిథిలావస్థలో ఉన్న ఓ భవనం కుప్పకూలిపోయింది. మహిళ భయంతో పక్కకి జరిగి పరుగులు తీసింది. లేదంటే ఇంటి గోడ కూలి ఆమె మృతి చెందేది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

Tags

Read MoreRead Less
Next Story