బ్రేకింగ్.. బండి సంజయ్, అక్బరుద్దీన్లపై కేసులు
By - Nagesh Swarna |28 Nov 2020 6:58 AM GMT
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్లపై కేసులు నమోదయ్యాయి. ఎస్ఆర్నగర్ పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 505 కింద కేసులు నమోదు చేశారు. వీరి వ్యాఖ్యలతో ఘర్షణలు చెలరేగే అవకాశాలున్నాయని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడితే చర్యలు తప్పవంటూ ఇటీవలే డీజీపీ కూడా హెచ్చరించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com