కంగ్రాట్స్ టీంఇండియా... : సీఎం కేసీఆర్

కంగ్రాట్స్ టీంఇండియా... : సీఎం కేసీఆర్
ఆస్ట్రేలియా గడ్డపైన చరిత్రాత్మక విజయాన్ని సాధించిన టీంఇండియా జట్టుకు అభినందనలు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

ఆస్ట్రేలియా గడ్డపైన చరిత్రాత్మక విజయాన్ని సాధించిన టీంఇండియా జట్టుకు అభినందనలు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. గాయాలతో కీలకమైన ఆటగాళ్ళు దూరమైనప్పటికీ అద్భుతమైన ఆటను కొనసాగించారని కేసీఆర్ అన్నారు.

ఈ విజయం చిరస్మరణీయంగా మిగిలిపోతుందని అన్నారు. అటు భారత జట్టు విజయం పట్ల మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. టీంఇండియా ప్లేయర్స్ భారత్ ను గర్వించేలా చేశారని, ఎక్కడ కూడా దైర్యాన్ని కోల్పోకుండా ఆడారని అన్నారు. ఇక 2021ను అద్భుతంగా ప్రారంభించారని అన్నారు.

ప్రపంచ క్రికెట్ లో శక్తివంతమైన జట్టుగా ఆసీస్ కి పేరుంది. ఆలాంటి ఆసీస్ ని ఎలాంటి సీనియర్లు లేకుండా కేవలం జూనియర్లతోనే వారి సొంత గడ్డపైనే మట్టి కరిపించడం అంటే మాములు విషయం కాదు.. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో గిల్ (91), పూజారా (56), పంత్ (89 నాటౌట్ ), సుందర్ (22) వీరోచిత పోరాటంతో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

అసలు ఈ మ్యాచ్ డ్రా అవ్వడమే గొప్ప అనుకుంటే భారత్ ను గెలిపించి హీరోస్ అయ్యారు. గత 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో ఓటమి ఎరుగని ఆసీస్ జట్టుకు టీమిండియా ఓటమి రుచి చూపించడం అనేది మరో హైలెట్ గా చెప్పుకోవాలి!

Tags

Read MoreRead Less
Next Story