9వ హరితహారానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌

9వ హరితహారానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌
హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టామన్నారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులో మొక్కను నాటారు

హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టామన్నారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులో మొక్కను నాటి తొమ్మిదో విడత హరితహారానికి శ్రీకారం చుట్టారు. సఫారీ వాహనంలో పార్కులో కలియతిరిగిన సీఎం కేసీఆర్‌.. ఫొటో ఎగ్జిబిషన్‌ను, అటవీ అధికారుల సామాగ్రిని తిలకించారు. అనంతరం బీటీఆర్‌ క్రికెట్‌ స్టేడియంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కేసీఆర్‌... తెలంగాణ ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. 8 ఏళ్లుగా ఎంతో కృషి చేసి పచ్చదనం పెంచుతున్నామన్నారు. ప్రస్తుంత 7.7 శాతానికి పచ్చదనం పెరిగిందన్నారు. గత పాలకు రాష్ట్రాన్ని బీడు భూములుగా మారిస్తే.. ఇప్పుడు రాష్ట్రాన్ని సస్యశ్యామం చేశామన్నారు.

పాలమూరు ఎత్తిపోతుల ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయ్యేదని, కానీ కాంగ్రెస్‌ నేతలు అడ్డుకున్నారంటూ ఫైర్‌ అయ్యారు. ఈ ప్రాజెక్టు 80శాతం పూర్తి చేశామన్నారు. ప్రజలకు సాగు,తాగునీరు ఇస్తుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. త్వరలోనే ఇబ్రహీంపట్నం,మహేశ్వరం, వికారబాద్‌లో నీటి కష్టాలు తీరుతాయన్నారు. మహేశ్వరానికి వైద్యకశాలల మంజూరు చేస్తామన్నారు. తుమ్మలూరులో సబ్‌స్టేషన్‌లో ఏర్పాటు చేస్తామన్నారు సీఎం కేసీఆర్.

Tags

Read MoreRead Less
Next Story