KCR : మతం పిచ్చిలో పడితే మనం ప్రమాదంలో పడతాం : కేసీఆర్‌

KCR : మతం పిచ్చిలో పడితే మనం ప్రమాదంలో పడతాం : కేసీఆర్‌
KCR : మతం, కులం పేరుతో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం కేసీఆర్‌.

KCR : మతం, కులం పేరుతో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం కేసీఆర్‌. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌, సనత్‌నగర్‌, అల్వాల్‌లో టిమ్స్‌ ఆస్పత్రుల నిర్మాణాలకు ఆయన భూమిపూజ చేశారు.

ఎయిమ్స్‌ స్థాయిలో టిమ్స్‌ నిర్మాణం చేస్తామని కేసీఆర్‌ తెలిపారు. అల్వాల్‌ టిమ్స్‌లో ప్రత్యేక ప్రసూతి కేంద్రం ఏర్పాటు చేస్తామని.. గాంధీ, నీలోఫర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. 16 స్పెషాలిటీ, 15 సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందిస్తామని చెప్పారు.

మతం పిచ్చిలో పడితే మనం ప్రమాదంలో పడతామన్నారు సీఎం కేసీఆర్‌. మనదేశం అందరినీ అక్కున చేర్చుకుంటుందన్నారు. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న సమాజం మనదన్నారు. మన భారతీయులు 13 కోట్ల మంది విదేశాల్లో ఉన్నారని.. వారిని మన దేశానికి పంపిస్తే వారికి ఎవరు ఉద్యోగాలివ్వాలని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story