మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్!

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్!
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ పరామర్శించారు. శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ సమాధివద్ద పూలమాల వేసి సీఎం నివాళులర్పించారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ పరామర్శించారు. శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ సమాధివద్ద పూలమాల వేసి సీఎం నివాళులర్పించారు. అనంతరం మంత్రి కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలిపారు. గత కొద్దిరోజుల క్రితం మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ మరణించారు. ఇవాళ దశదిన కర్మసందర్భంగా మహబూబ్‌నగర్ లోని పాలకొండ దగ్గరున్న మంత్రి ఫామ్ హౌజ్‌కు... ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకొని సంతాపం తెలిపారు. సీఎం వెంట పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటుచేశారు.

Tags

Read MoreRead Less
Next Story