రైతు సంఘాల భారత్‌ బంద్‌కు సీఎం కేసీఆర్‌ మద్దతు

రైతు సంఘాల భారత్‌ బంద్‌కు సీఎం కేసీఆర్‌ మద్దతు

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో ఈ నెల 8న రైతు సంఘాలు తలపెట్టిన భారత్‌ బంద్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ మద్దతు ప్రకటించారు. నూతన చట్టాల్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. బంద్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రత్యక్షంగా పాల్గొంటారని తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల పోరాటం న్యాయమైందన్న కేసీఆర్....‌ అన్నదాతల ప్రయోజనాల్ని దెబ్బతీసేలా కేంద్రం చట్టాలు చేసిందని విమర్శించారు. నూతన వ్యవసాయ చట్టాల్ని పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించిందని తెలిపారు. వ్యవసాయ చట్టాల్ని ఉపసంహరించుకునే వరకు రైతులు పోరాటం సాగించాలని అన్నారు. భారత్‌ బంద్‌ విజయవంతానికి టీఆర్‌ఎస్‌ కృషి చేస్తోందని స్పష్టంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story