దుబ్బాకలో మంచి మెజార్టీతో గెలుస్తాం : సీఎం కేసీఆర్‌

దుబ్బాకలో మంచి మెజార్టీతో గెలుస్తాం : సీఎం కేసీఆర్‌

దుబ్బాకలో మంచి మెజార్టీతో గెలుస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.. ధరణి పోర్టల్‌ ప్రారంభించిన తరువాత మీడియాతో చిట్‌ చాట్‌ చేసిన సీఎం కేసీఆర్‌ దుబ్బాక ఉపఎన్నిక తమకు పెద్ద లెక్క కాదన్నారు. ఇప్పటికే టిఆర్‌ఎస్‌ విజయం ఖాయమైందన్నారు.. రాబోయే 15 రోజుల్లో నాన్‌ అగ్రికల్చర్‌ ఆస్తుల రిజిస్ట్రేషన్‌లు ప్రారంభవుతాయని క్లారిటీ ఇచ్చారు. ప్రతి ఓపెన్‌ ప్లాట్‌ దారుడు నాన్‌ అగ్రికల్చర్‌ ఆస్తిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అన్నారు. ప్లాట్‌ల వివరాలు వెబ్‌సైట్‌లో కనిపించొద్దు అనుకుంటే హైడ్‌ ఆప్షన్‌ పెట్టుకోవచ్చన్నారు. పూర్తి టైటిల్‌ విషయంలో ఓనర్‌ నష్టపోతే ప్రభుత్వమే నష్టపరిహారం ఇస్తుందన్నారు. ధరణి పోర్టల్‌ బ్యాకప్‌ సర్వర్లు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్‌.

Tags

Read MoreRead Less
Next Story