వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్దే అధికారం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
By - TV5 Digital Team |6 Nov 2021 12:30 PM GMT
Komatireddy : వార్డు నెంబర్ కూడా లేని ఏపీలో కాంగ్రెస్కు 6వేల ఓట్లువచ్చాయని.. హుజురాబాద్లో మాత్రం 3వేల ఓట్లుమాత్రమే రావడం బాధా కరమన్నారు.
Komatireddy : వార్డు నెంబర్ కూడా లేని ఏపీలో కాంగ్రెస్కు 6వేల ఓట్లువచ్చాయని.. హుజురాబాద్లో మాత్రం 3వేల ఓట్లుమాత్రమే రావడం బాధాకరమన్నారు భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 72, 78 సీట్లువస్తాయని.. సీఎం అవుతామని తమ పార్టీలో పోర్టు పోలియోలు పంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మాణిక్కం ఠాగూర్ వచ్చి తాము అధికారంలోకి వస్తామని అంటే నిజమే అనుకున్నానన్నారు. మా పార్టీపెద్దలకు ప్రజల్లో మంచి క్రేజ్ ఉందని.. తాను అందుకే హుజురాబాద్ ప్రచారానికి వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నా అన్నారు. తాను తెలంగాణ ఉద్యమకారుణ్ని అని.. తెలంగాణ కోసం మంత్రిపదవి త్యాగం చేశానని గుర్తు చేశారు. తనకు ఏ పదవి లేకున్నా.. ఎంపి పదవి ఉందన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com