అల్లర్లకు కుట్ర.. మాకు సమాచారం అందింది : డీజీపీ మహేందర్‌రెడ్డి

అల్లర్లకు కుట్ర.. మాకు సమాచారం అందింది : డీజీపీ మహేందర్‌రెడ్డి

హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు డీజీపీ మహేందర్‌రెడ్డి. సోషల్‌ మీడియాలో పోస్టింగులపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. అల్లర్లకు కుట్ర జరుగుతోందంటూ తమకు సమాచారం అందిందన్నారు. ఎలాంటి రూమర్లు వచ్చినా ప్రజలు నమ్మొద్దని కోరారు. పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు. 90 మంది రౌడీషీటర్లను బైండోవర్‌ చేశామన్నారు. గత ఆరేళ్లలో హైదరాబాద్‌లో ఎప్పుడూ అల్లర్లు లేవన్నారు డీజీపీ. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story