తెలంగాణలో రెండు లక్షలు దాటిన కరోనా కేసులు

X
By - kasi |5 Oct 2020 10:33 AM IST
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 13 వందల 35 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా... 2 వేల 176 మంది కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 6 వందల 11కి చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం లక్షా 72 వేల 388 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 11 వందల 71 కు చేరింది. ప్రస్తుతం 27 వేల 52 యాక్టివ్ కేసులున్నాయి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 262, రంగారెడ్డి జిల్లాలో 137, మేడ్చల్లో 91 కేసులు నమోదుకాగా... కరీంనగర్లో 83, నల్గొండలో 72 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com