రెండు లక్షలకు చేరువగా తెలంగాణలో కరోనా కేసులు

తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య దాదాపు రెండు లక్షలకు చేరుకుంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 54 వేల 98 పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 2 వేల 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఒక లక్షా 95 వేలు దాటిందని.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఇక్క రోజులో కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 11 వందల 45కి చేరింది.
కరోనా నుంచి నిన్న ఒక్క రోజులో 2 వేల 437 మంది రికవర్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక లక్షా 65 వేల 884 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 28 వేల 620 యాక్టివ్ కేసులు ఉండగా.. వారిలో 23 వేల 372 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 31 లక్షల 4 వేల 524 కరోనా టెస్టులు నిర్వహించినట్టు.. హెల్త్ బులెటిన్లో ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణలో కరోనా రికవరీ రేటు... 84.78 శాతం ఉండగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com