రేపటి నుంచి తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ : ఈటెల
By - TV5 Digital Team |15 Jan 2021 1:00 PM GMT
వ్యాక్సిన్ తీసుకున్నాక రియాక్షన్ వస్తే చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఫస్ట్ డోస్ ఇచ్చిన నాలుగు వారాలకు సెకండ్ డోస్ ఇస్తామని తెలిపారు.
రేపటి నుంచి తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్నాక రియాక్షన్ వస్తే చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఫస్ట్ డోస్ ఇచ్చిన నాలుగు వారాలకు సెకండ్ డోస్ ఇస్తామని తెలిపారు. అన్ని రకాల ట్రయల్స్ తర్వాతే టీకాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యామన్నారు.
ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే టీకా పంపిణీ చేస్తున్నామని... రేపు మొదలయ్యే వ్యాక్సినేషన్ నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. కేంద్రం అనుమతి తర్వాతే అందరికీ టీకా ఇస్తున్నామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఈటెల తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com