హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్లో అవినీతి తిమింగలాలు..

X
By - kasi |12 Sept 2020 9:35 PM IST
హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్లో అవినీతి తిమింగలాలు సీబీఐ వలకు చిక్కాయి. జీఎస్టీ కమిషనరేట్లోని పన్ను ఎగవేత నిరోధక విభాగంలో అవినీతి..
హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్లో అవినీతి తిమింగలాలు సీబీఐ వలకు చిక్కాయి. జీఎస్టీ కమిషనరేట్లోని పన్ను ఎగవేత నిరోధక విభాగంలో అవినీతి జరుగుతున్నట్లు సీబీఐకి ఫిర్యాదు అందింది. ఇన్పుట్ క్రెడిట్ మంజూరుకు సదరు కంపెనీ డైరెక్టర్ల నుంచి సుధారాణి, శ్రీనివాస గాంధీలు 5 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఇద్దరు ఉన్నత ఉద్యోగులపై సీబీఐ నిఘా పెట్టింది. ఓ ప్రైవేట్ కంపెనీకి సంబంధించి దాడుల్లో ఈ బాగోతం బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు... సుధారాణి, శ్రీనివాస గాంధీపై కేసు నమోదు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com