Telangana Rains: భారీ వర్షాలతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. సీఎస్ సమీక్ష..
Telangana Rains: భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పని చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని. ప్రాణ, పశువులు, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com