మద్యం తాగి వాహనం నడిపితే ఆరు నెలలు..

మద్యం తాగి వాహనం నడిపితే ఆరు నెలలు..
మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై పోలీసులు మరోసారి దృష్టి సారించారు.

ఒక చేత్తో మందు బాటిల్.. మరో చేత్తో స్టీరింగ్.. సినిమా కాదురా బాబు జీవితం.. అక్కడ నటిస్తే సరిపోతుంది.. ఇక్కడ అలా చేస్తే జీవితం ముగిసిపోతుంది. మహా నగరాల్లో తిన్నగా నడిపితేనే ఇంటికి చేరుకోవడం కష్టంగా ఉంటుంది. ఇక తాగి నడిపితే అదృష్టం బావుంటే ఇంటికి లేదంటే అంతే సంగతులు. తాజాగా మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై పోలీసులు మరోసారి దృష్టి సారించారు. ఇకపై వారానికి మూడు రోజులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇలా తాగి నడిపే వారికి రూ.10 వేల జరిమానా, ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రదుదు చేశారు. 210 మందికి జైలు శిక్ష విధించారు.

రహదారులపై ప్రమాదాలను నియంత్రించేందుకు, ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల సవరణ చట్టం అమల్లోకి తెచ్చింది. పోలీసులు నివేదిక ఆధారంగా జైలు శిక్షలు, లైసెన్సు రద్దులపై కోర్టులు ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి.

లాక్టౌన్ అనంతరం పబ్బుల్లో పార్టీలు జోరందుకున్నాయి. నాలుగైదు రోజులుగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో పార్టీలు జరుగుతుండడాన్ని పోలీసులు గుర్తించారు. అర్థరాత్రి దాటాక కార్లు, జీపుల్లో మందుబాబులు వెళ్తున్నట్లు వారి నిఘాలో తెలుసుకున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేయనున్నారు.

మద్యం తాగి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే భవిష్యత్తులో కష్టాలను కోరి తెచ్చుకున్నట్లే. పట్టుబడిన వ్యక్తుల అభియోగ పత్రాల ఆధారంగా ప్రతి కేసూ కోర్టులో నమోదవుతుంది. జైలుకు వెళ్తే ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లేందుకు వీలుండదు. మొదటిసారి పట్టుబడితే తాత్కాలికంగా లైసెన్స్‌ని రద్దు చేస్తారు. ఎక్కువ సార్లు పట్టుబడితే మాత్రం లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేయవచ్చు అని నగర ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story