పిచ్చిపిచ్చిగా మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టొద్దు : బండి సంజయ్ పై ఎర్రబెల్లి ఫైర్
By - TV5 Digital Team |13 Jan 2021 12:15 PM GMT
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు సామాజిక బాధ్యతతో మెలగాలని సూచించారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలం మైలారం గ్రామంలో అర్హులైన నిరుపేదలకు సంక్రాంతి కానుకగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందజేశారు. తరువాత బండి సంజయ్ పై విమర్శలు చేశారు. ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మాటలు ప్రజలను రెచ్చగొట్టేలా ఉండడం దారుణమన్నారు ఎర్రబెల్లి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com