జానారెడ్డి ఇంటికి కూడా భగరీథ నీళ్లే వస్తున్నాయి : ఎర్రబెల్లి దయాకర్‌ రావు

జానారెడ్డి ఇంటికి కూడా భగరీథ నీళ్లే వస్తున్నాయి : ఎర్రబెల్లి దయాకర్‌ రావు
మిషన్‌ భగీరథ విషయంలో కాంగ్రెస్‌ నాయకులు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మండిపడ్డారు.

మిషన్‌ భగీరథ విషయంలో కాంగ్రెస్‌ నాయకులు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మండిపడ్డారు. నల్గొండకు గడచిన మూడేళ్ల నుంచి ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. సీనియర్‌ నేత జానారెడ్డి సైతం మిషన్‌ భగీరథ నీళ్లు కూడా తాగుతున్నారని.. అయితే రోడ్డు నిర్మాణం కారణంగా రెండు రోజుల నుంచి ఆయన ఇంటికి నీళ్లు రావడం లేదన్నారు. ప్రతిపక్ష నేతలు నిర్మాణాత్మక విమర్శలు చేయాలి తప్ప.. ఇలా రాజకీయ ఆరోపణలు చేయడం తగదని ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story