Etela Rajendar : ప్రజలను పక్కదారి పట్టించేందుకే.. సీఎం కేసీఆర్‌ ముంబై పర్యటన : ఈటల రాజేందర్‌

Etela Rajendar : ప్రజలను పక్కదారి పట్టించేందుకే.. సీఎం కేసీఆర్‌ ముంబై పర్యటన : ఈటల రాజేందర్‌
Etela Rajendar : ఫెడరల్‌ ఫ్రంట్‌ అని గతంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.

Etela Rajendar : ఫెడరల్‌ ఫ్రంట్‌ అని గతంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. ప్రజలను పక్కదారి పట్టించేందుకే ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. అందులో భాగంగానే ముంబై పర్యటన అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, బీజేపీయేతర కూటమి దేశంలో సాధ్యం కాదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వాలనే ఉద్దేశం కేసీఆర్‌కు లేదని విమర్శించారు ఈటల‌. రెండోసారి గెలిచిన తర్వాత ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదన్నారు. ఆర్టీసీలో ఉద్యోగాలు ఇచ్చామనడం పచ్చి అబద్దమన్నారు. KTR చెప్పిన లక్షా 32వేల ఉద్యోగాల్లో 31వేలు మాత్రమే TSPSC ద్వారా నింపారన్నారు. గ్రూప్-1 నోటిఫికేషన్‌ ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. ఇక.. వీఆర్‌ఏలకు స్కేల్‌ ప్రకారం జీతాలు ఇవ్వడం లేదని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story