గుప్త నిధుల పేరిట మోసం.. చిన్న చెంబును చేతిలో పెట్టి వెళ్లిపోయిన బురిడీ బాబా..!

గుప్త నిధుల పేరిట మోసం.. చిన్న చెంబును చేతిలో పెట్టి వెళ్లిపోయిన బురిడీ బాబా..!

File Photo

సూర్యాపేట గొల్ల బజార్‌లో గుప్త నిధుల పేరిట మోసం వెలుగు చూసింది. ఇంట్లో గుప్త నిధులు వెలికి తీస్తామని 2లక్షల 50 వేల రూపాయలు వసూలు చేసిన బురిడీ బాబా లీల బయటపడింది.

సూర్యాపేట గొల్ల బజార్‌లో గుప్త నిధుల పేరిట మోసం వెలుగు చూసింది. ఇంట్లో గుప్త నిధులు వెలికి తీస్తామని 2లక్షల 50 వేల రూపాయలు వసూలు చేసిన బురిడీ బాబా లీల బయటపడింది. ఇంట్లో తవ్వకాలు జరిపిన మోసగాడు.. చిన్న చెంబును ఇంటి యజమానుల చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. చెంబును ఇప్పుడే తెరవొద్దని.. ఫలానా రోజు తెరవాలని తెలిపాడు. నకిలీ బాబా చెప్పిన రోజు చెంబును తెరిచి చూస్తే అందులో ఏమీ లేకపోవడంతో ఇంటి యజమానులు కంగు తిన్నారు. మోసపోయామని తెలుసుకున్నారు. మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా నకిలీ బాబాను అరెస్ట్‌ చేశారు.

అటు సూర్యపేటలోని గొల్ల బజార్‌కు చెందిన శ్రీదేవి, శ్రీనివాస్‌ దంపతులు నివసిస్తున్నారు. నాలుగేళ్లలో ఇంట్లో నాలుగు మరణాలతో విషాదం నెలకొంది. ఇటీవల శ్రీదేవి, శ్రీనివాస్‌ దంపతులు కూడా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఎందుకు తమకు ఇలా జరుగుతుందో అంతుపట్టక జ్యోతిష్యులు, భూతవైద్యుల్ని సంప్రదించారు. ఇదే అదనుగా భావించిన ఓ నకిలీ బాబా మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని... వాటి వల్లే ఇలా జరుగుతోందని చెప్పాడు. హోమం, శాంతి చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. ఇందుకు 11 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వెల్లడించాడు. ఆఖరికి రెండున్నర లక్షలకు బేరం కుదుర్చుకుని ఇంట్లో పూజలు, తవ్వకాలు చేశాడు.

తవ్వకాలు, పూజలు జరుపుతున్నప్పుడు లోపలికి ఎవరూ రావొద్దని నకిలీ బాబా చెప్పాడు. కాసేపటికి లోపలి నుంచి పొగలు వచ్చేలా చేశాడు. అనంతరం చేతిలో ఓ చెంబు దాని తాళంచెవి చేతిలో పెట్టాడు. ఆ చెంబులోనే గుప్త నిధులు ఉన్నాయని, వాటిని ఇప్పుడే తెరవొద్దని, ఫలానా రోజు తెరిస్తేనే నిధులు లభిస్తాయని చెప్పాడు. అప్పటికే తీవ్ర విషాదంలో ఉన్న ఆ దంపతులు నకిలీ బాబా చెప్పింది నిజమేననుకున్నారు. తీరా చెంబు ఓపెన్‌ చేసి చూస్తే అందులో ఏమీ లేకపోవడంతో మోసపోయినట్టు తెలుసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story